లండన్ : కరోనా వైరస్ వల్ల బ్రిటన్లో లాక్డౌన్ ఆంక్షలు ఇంకా అమలులో ఉన్నాయి. అయితే ఆ ఆంక్షలపై ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇవాళ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. దీని కన్నా ముందు ఆయన ఓ విషయాన్ని తెలిపారు. వైరస్తో కలిసి జీవించడం నేర్చుకోవాలని ఆయన ప్రజలను కోరారు. నిజానికి గత నెల 21వ తేదీన బ్రిటన్లో పూర్తి స్థాయిలో ఆంక్షలను ఎత్తివేయాలనుకున్నారు. కానీ డెల్టా వేరియంట్ విజృంభించిన నేపథ్యంలో ఆ ఆంక్షలను కొనసాగిస్తున్నారు. ఇవాళ బ్రిటన్ ప్రధాని మీడియాతో మాట్లాడనున్నారు. ఆ దేశంలో ఇంకా నైట్ క్లబ్లకు అనుమతి ఇవ్వలేదు. పూర్తి స్థాయి సామర్థ్యంతో ఈవెంట్లను నిర్వహించడం లేదు. ఆంక్షలను ఎత్తివేసే కేసులు పెరిగే అవకాశం ఉందని, కానీ వ్యాక్సినేషన్ ప్రక్రియ వల్ల మేలు జరుగుతోందన్నారు.