రాజన్న సన్నిధిలో 25వేలకు పైగా భక్తులు
14లక్షల ఆదాయం రాక
వేములవాడ టౌన్, ఏప్రిల్ 5: వేములవాడ రాజన్న ఆలయం సోమవారం భక్తులతో పోటెత్తింది. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో అనుబంధ దేవాలయాలైన భీమేశ్వరాలయం, బద్ది పోచమ్మ, నగరేశ్వరాలయాలు, క్షేత్ర ప్రధాన వీధులు కిటకిటలాడాయి. భక్తులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. సుమారు 25వేల మందికి పైగా భక్తులు రాజన్నను దర్శించుకోగా, వివిధ ఆర్జిత సేవల ద్వారా 14లక్షలకు పైగా ఆదాయం సమకూరిందని ఆలయ అధికారు లు తెలిపారు. అలాగే స్వామివారిని రిటైర్డ్ ఐజీ నవీన్చంద్ దంపతులు దర్శించుకున్నారు. అద్దాల మండపంలో అర్చకులు వారిని ఆశీర్వదిం చగా, పర్యవేక్షకుడు నాగుల మహేశ్ స్వామివారి ప్రసాదాన్ని అందజే శారు. ఇక్కడ ఎస్పీ రాహూల్హెగ్డే, డీఎస్పీ చంద్రకాంత్, సీఐలు వెంకటే శ్, ఉపేందర్, పర్యవేక్షకుడు శ్రీరాములు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
జాతి రత్నాలు’ 25 డేస్ కలెక్షన్స్.. బ్లాక్బస్టర్ కా బాప్..