పోచారం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అందజేత
బాన్సువాడ, మే 22 : కొవిడ్ బాధితులకు చికిత్స అందించేందుకు అవసరమైన 10 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను పోచారం ట్రస్ట్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి బాన్సువాడ ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ శ్రీనివాస్ప్రసాద్కు శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా పోచారం ట్రస్ట్ ప్రజలకు సేవలందిస్తున్నదన్నారు. లాక్డౌన్ అమలులో ఉన్నందున అనవసరంగా బయటికి రావొద్దని ప్రజలకు ఆయన సూచించారు. సడలింపు సమయంలోనే నిత్యావసర వస్తువులను ఇండ్లకు తీసుకెళ్లాలని, 10గంటల తరువాత ఇండ్ల నుంచి బయటికి రాకుండా పోలీసులకు సహకరించాలని కోరారు. రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అంజిరెడ్డి, ఎంపీపీ దొడ్ల నీరజావెంకట్రామ్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పాత బాలకృష్ణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోహన్నాయక్, మాజీ డైరెక్టర్ మహేందర్రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు పిట్ల శ్రీధర్, మాజీ అధ్యక్షుడు గోపాల్రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ గురు వినయ్కుమార్, భగవాన్రెడ్డి పాల్గొన్నారు.
ఆపత్కాలంలో అండగా..
కరోనా విపత్కర పరిస్థితుల్లో పేదలకు, కొవిడ్ బాధితులకు పోచారం ట్రస్ట్ అండగా నిలుస్తున్నది. ఫస్ట్ వేవ్ కాలంలో సుమారు 5వేల కుటుంబాలకు 25 కిలోల బియ్యంతోపాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనాబారిన పడిన పలువురికి హైదరాబాద్లోని దవాఖానల్లో బెడ్లు ఇప్పించడంతోపాటు మందులు, ఆర్థిక సహాయం అందజేశారు. కరోనా కష్టకాలంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తనయులు భాస్కర్రెడ్డి, సురేందర్ రెడ్డి, డాక్టర్ రవీందర్రెడ్డి అందిస్తున్న సహాయసహకారాలు మరిచిపోలేనివని ప్రజలు అభినందిస్తున్నారు. కష్ట కాలంలో పోచారం ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టడంపై కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
రోటరీ ఆధ్వర్యంలో ఇన్పేషెంట్ బెడ్లు అందజేత
బాన్సువాడ ప్రభుత్వ ఏరియా దవాఖానకు రోటరీ క్లబ్-3150 స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 5 ఇన్పేషెంట్ బెడ్లను అందజేశారు. రోటరీ క్లబ్ ప్రతినిధులు బెడ్లను దవాఖాన సూపరింటెండెంట్ శ్రీనివాస్కు అప్పగించారు. కార్యక్రమంలో క్లబ్ జిల్లా జాయింట్ సెక్రటరీ రంజిత్సింగ్ ఠాకూర్ , దవాఖాన సిబ్బంది పాల్గొన్నారు.