బెంగళూరు : కర్ణాటకలో పరువు హత్య కలకలం సృష్టిస్తోంది. 19 ఏండ్ల వయసున్న ఇద్దరు ప్రేమికులను అత్యంత దారుణంగా చంపేశారు. విజయపురా జిల్లాకు చెందిన ఇద్దరు యువతీయువకులు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే కులాలు వేరు కావడంతో.. వీరి ప్రేమను ఇరు కుటుంబాలు వ్యతిరేకించాయి. ఈ క్రమంలో ఆ ఇద్దరిని అపహరించి హత్య చేశారు. తలపై బండరాళ్లతో మోది చంపేశారు. ఈ ఘటన మంగళవారం వెలుగు చూసింది. అయితే యువతి తండ్రి, సోదరులు, మరో ఇద్దరు బంధువులు పరారీలో ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.