ముంబై : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంతో సంబంధం ఉన్న డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణ చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో సుశాంత్ గర్ల్ఫ్రెండ్ రియాను గతంలో అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే చార్జ్షీట్లో ఆమె చెప్పిన వాస్తవాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. సుశాంత్కు మాదకద్రవ్యాలు అలవాటు ఉన్నట్లు గతంలో చెప్పిన రియా.. ఇప్పుడు మరో నటి సారా అలీ ఖాన్ కూడా ఇందులో భాగమైనట్లు వెల్లడించింది. సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్ కూతురైన సారా అలీ ఖాన్.. సుశాంత్తో కలిసి కేదార్నాథ్ సినిమాలో నటించింది. అయితే సారాతో తనకు పరిచయం ఉన్నట్లు రియా తన చార్జ్షీట్లో చెప్పింది. సారా తనకు గంజాయితో పాటు వోడ్కాను కూడా ఆఫర్ చేసినట్లు రియా తన వాంగ్మూలంలో వెల్లడించింది. సుశాంత్ మృతి కేసులో తీసుకున్న స్టేట్మెంట్లో ఆమె ఈ విషయాన్ని బయటపెట్టింది. 2017 జూన్ 4వ తేదీన సారాతో చాటింగ్ చేశానని, చేతి చుట్టే గంజాయి చుట్టలు సారా వద్దే ఉండేవని, వాటిని తాను కూడా వాడినట్లు రియా చెప్పింది. సారా తనకు వోడ్కా కూడా ఇచ్చినట్లు రియా పేర్కొన్నది.
గత ఏడాది సుశాంత్ మృతి కేసులో నటి సారాను కూడా ఎన్సీబీ విచారించింది. కొంత కాలం సుశాంత్తో డేటింగ్ చేసినట్లు సారా అంగీకరించింది. థాయిల్యాండ్కు ట్రిప్ కూడా వెళ్లినట్లు ఆమె చెప్పుకొచ్చింది. సుశాంత్లో లివిన్ రిలేషన్షిప్లో ఉన్న రియా.. హీరో చావడానికి కొన్ని రోజుల ముందు అతన్ని విడిచి వెళ్లింది. డ్రగ్స్ కేసులో ఎన్సీబీ ఆమెను 28 రోజుల పాటు అరెస్టు చేసింది. సుశాంత్ అకౌంట్ నుంచి డబ్బులు మాయమైన కేసులో ఈడీ దర్యాప్తు చేపడుతున్నది.