లక్నో: వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తన క్యాబినెట్ను వచ్చేవారం విస్తరించనున్నారు. అన్ని కులాల వారికి సమ ప్రాధాన్యం కల్పించడానికి వీలుగా క్యాబినెట్ విస్తరణ ఉంటుందని సమాచారం.
ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన జితేన్ ప్రసాద, సోమేంద్ర తోమర్, క్రుష్ణ పాశ్వాన్, తేజ్పాల్ గుర్జార్, రామచంద్ర విశ్వకర్మ, మంజు సివాచ్, నిషాద్ పార్టీ అధినేత సంజయ్ నిషాద్, అప్నాదళ్ నేత ఆశీష్ పటేల్లకు యోగి క్యాబినెట్లో చోటు దక్కనున్నదని తెలుస్తోంది. ఇటీవలే యూపీ బీజేపీ సీనియర్ నాయకులు.. సీఎం యోగి ఆదిత్యనాథ్తో చర్చలు జరిపారని వినికిడి. ఈ పేర్లకు బీజేపీ అధిష్ఠానం ఆమోదం తెలిపిందని సమాచారం.
ప్రస్తుతం యోగి క్యాబినెట్లో 23 మంది క్యాబినెట్ మంత్రులు, తొమ్మిది మంది స్వతంత్ర హోదా, 22 మంది సహాయ మంత్రులుగా ఉన్నారు. యూపీ క్యాబినెట్లో 54 మందికి చోటు దక్కకే అవకాశం ఉంది. దీని ప్రకారం ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముంగిట యోగి ఆదిత్యనాథ్ ప్రస్తుత తన క్యాబినెట్ మంత్రులను తొలగించకపోవచ్చునని సమాచారం.