న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ఢిల్లీ సాంకేతిక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా యోగేశ్ సింగ్ నియమితులయ్యారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఈ మేరకు బుధవారం తెలిపింది. కేంద్ర విశ్వవిద్యాలయాలకు విజిటర్గా ఉన్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇద్దరు వైస్ ఛాన్సలర్ల నియామకాన్ని ఆమోదించినట్లు పేర్కొంది. ఢిల్లీ యూనివర్సిటీ వీసీగా యోగేశ్ సింగ్ను, మధ్యప్రదేశ్ సాగర్లోని డాక్టర్ హరి సింగ్ గౌర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా నీలిమా గుప్తాను నియమించినట్లు వెల్లడించింది. నీలిమా గుప్తా ప్రస్తుతం బీహార్లోని టిల్కా మాంఝి భాగల్పూర్ యూనివర్సిటీ (TMBU) వైస్ ఛాన్సలర్గా పనిచేస్తున్నట్లు వివరించింది.