హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): కనికరం లేని కరోనా అష్టకష్టాలు పెడుతున్నది. ఒంట్లోని రోగనిరోధకశక్తిని తగ్గించి ఓపిక లేకుండా చేస్తున్నది. మాయదారి రోగం అటు మనసును, ఇటు శరీరాన్ని ఇబ్బంది పెడుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లోనే యోగా ఉపశమనం కలుగజేస్తుంది. సోమవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీకి చెందిన పింక్ లోటస్ అకాడమీ రోగనిరోధక శక్తిని పెంచే, మనసుకు రిలాక్స్ కలిగించే ఆసనాలను సూచించింది. సరైన అవగాహనతో యోగాసనాలు వేస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యనైనా తగ్గించుకోవచ్చని పేర్కొన్నది.
స్టాప్ ..
చాలా సులభంగా వేసే ఈ ఆసనం శరీరానికి చాలా ప్రయోజనాలు చేకూరుస్తుంది. భుజాలు, ఛాతి, కింది భాగంలోని కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది.
బటర్ైప్లె ..
ఈ ఆసనం తొడలు, గజ్జలు, మోకాలుకు ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది. ఎక్కువ సమయం నిలబడటం, నడవడం ద్వారా వచ్చే అలసటను
తొలగిస్తుంది.
క్యాట్ అండ్ కౌవ్ ..
ఈ ఆసనం కుక్క, ఆవును పోలి ఉంటుంది. శరీరంలోని ఒత్తిడి తొలగి, గొంతు, పొట్టభాగాలకు మసాజ్ చేసినట్టు అవుతుంది.
పెంగ్విన్ ..
శరీరంలోని తొడ, గజ్జలు, వెనుక భాగాలను స్ట్రెస్ చేస్తుంది. ఎక్కువసేపు కూర్చొవడం ద్వారా వచ్చే ఒత్తిడి బాధ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. చిత్రంలో చూపించినట్టు కుడివైపు అయిపోయాక ఎడమవైపునకు, ఎడమవైపు అయిపోయాక కుడివైపునకు రెండుసార్లు ఈ ఆసనం వేయాలి.