నిజామాబాద్లో 34.. కామారెడ్డిలో 22
గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తి
జుక్కల్ మండలంలో ఒకరి మృతి
పలు మండలాల్లో కొవిడ్ నిర్ధారణపరీక్షా శిబిరాలు
మోపాల్లో స్వచ్ఛంద లాక్డౌన్
ఖలీల్వాడి/ విద్యానగర్, మార్చి 20: ఉమ్మడి జిల్లాలో శనివారం 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో 34 పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా ఆరోగ్యశాఖఅధికారి సుదర్శనం తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 16,218 పాజిటివ్ కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాలో 1,637 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 22 పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా నోడల్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 13,821 పాజిటివ్ కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు.
కుర్నాపల్లిలో ఆరుగురికి కరోనా పాజిటివ్
ఎడపల్లి (శక్కర్నగర్), మార్చి 20: ఎడపల్లి మండలంలోని కుర్నాపల్లి గ్రామంలో శనివారం ఆరుగురికి కరోనా పాజిటివ్గా వైద్యశాఖ అధికారులు నిర్ధారించారు. ఈనెల 19న ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో సదరు కుటుంబంలోని మిగతా నలుగురికి పరీక్షలు నిర్వహించారు.ముగ్గురికి పాజిటివ్గా తేలింది. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించగా, మరో ఇద్దరికి పాజిటివ్గా తేలింది. విష యం తెలుసుకున్న ఎడపల్లి ఎంపీడీవో శంకర్, తహసీల్దార్ ప్రవీణ్కుమార్ గ్రామాన్ని సందర్శించారు. వైద్య శిబిరాన్ని పరిశీలించారు. కొవిడ్ నిబంధనలను తప్పకుండా పాటించేలా చూడాలని సర్పంచ్ సావిత్రి, ఎంపీటీసీ వెంకయ్యగారి రాంరెడ్డికి సూచించారు.
వీరన్నగుట్టలోనూ ఆరుగురికి ..
రెంజల్, మార్చి 20 : మండలంలోని 79 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, ఆరుగురికి కరోనా పాజిటివ్గా వచ్చినట్లు మండల వైద్యాధికారులు తెలిపారు. వీరన్నగుట్టలో 65 మందికి, రెంజల్ పీహెచ్సీలు 10 మంది, కందకుర్తి చెక్ పోస్టు వద్ద నలుగురికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. వీరన్నగుట్టలో ఆరుగురికి పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ఐసొలేషన్ కిట్లను అందజేసి హోం క్వారంటైన్లో ఉంచినట్లు తెలిపారు.
వర్నిలో ఒకరికి..
వర్ని, మార్చి 20: మండల కేంద్రంలోని వడ్డేపల్లి ప్రాంతానికి చెందిన ఓ మహిళకు కరోనా వైరస్ సోకినట్లు వర్ని కమ్యూనిటీ వైద్యశాల అధికారి వెంకన్న తెలిపారు.
ఆర్మూర్లో నలుగురికి..
ఆర్మూర్, మార్చి 20 : పట్టణంలోని వంద పడకల దవాఖానలో 82 మందికి పరీక్షలు నిర్వహించగా.. నలుగురికి పాజిటివ్ వచ్చినట్లు డిప్యూటీ డీఎంహెచ్వో రమేశ్, పట్టణ ఆరోగ్యశాఖాధికారిణి అయేషా ఫిర్దోస్ తెలిపారు.
బీబీపేట్లో ఇద్దరికి..
బీబీపేట్, మార్చి 20: మండల కేంద్రంలోని పీహెచ్సీలో పలువురికి పరీక్షలు నిర్వహించగా, ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లు హెచ్ఈవో శంకర్ తెలిపారు.
కరోనాతో ఒకరు మృతి
నిజాంసాగర్, మార్చి 20: జుక్కల్ మండలంలోని పెద్దఏడ్గిలో శంకరప్ప (75) కరోనాతో శనివారం మృతిచెందినట్లు మండల వైద్యా ధికారి ప్రశాంత్ తెలి పారు. ఈనెల 13న దెగ్లూర్లోని ఓ ప్రైవేటు దవా ఖా నకు వెళ్లి తిరిగి వస్తుండగా.. మ ద్నూ ర్ మండలం లోని మహారాష్ట్ర సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టు వద్ద పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ఆయనను నేరుగా నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు.