న్యూయార్క్: అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు వాల్టర్ మోండలే (93) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతోనే ఆయన మృతిచెందారని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ‘నా సమయం వచ్చేసింది. జొవాన్, ఎలీనార్ను కలిసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని మోండలే గతంలో రాసిన లేఖను మరణం తర్వాత ఆయన సిబ్బంది విడుదల చేశారు. మోండలే భార్య జోవాన్ 2014లో మరణించగా, కుమార్తె ఎలీనార్ 51 ఏళ్ల వయసులో 2011లో మృతి చెందారు.
జమ్మీ కార్టర్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 1977 నుంచి 1981 వరకు మోండలే అమెరికా ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఉపాధ్యక్షుడు కాకముందు 1960 నుంచి 64 వరకు వాల్తేర్ తన సొంత రాష్ట్రమైన మిన్నెసొటాకు అటార్నీ జనరల్గా సేవలు అందించారు. ఆ తర్వాత 1964 నుంచి 1976 వరకు యూఎస్ సెనేటర్గా పనిచేశారు. కార్టర్ పదవీకాలం ముగిసిన తర్వాత 1993 నుంచి 1996 మధ్య జపాన్కు అమెరికా రాయబారిగా పనిచేశారు.
కాగా, వాల్టర్ మృతికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మిన్నెసొటా సెనేటర్ అమీ క్లొబుచార్ తదితరులు నివాళులు అర్పించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి.
మళ్లీ రూ.47 వేల దిగువకు బంగారం
మునక్కాయల కన్న మునగాకే మిన్న..!
వేసవిలో శరీరాన్ని చల్లబరిచే ఈ పానీయాలు తీసుకోవాలి..!
కేంద్రమంత్రి జితేంద్రసింగ్కు కరోనా
మే 1 వరకు తెలంగాణలో నైట్ కర్ఫ్యూ