నల్లగొండ : నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో తమకు మద్దతు ఇవ్వాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం వామపక్ష పార్టీలకు లేఖ రాసింది.
కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.
ఆదివారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో ఫోన్లోనూ మాట్లాడారు.
త్వరలో కమ్యూనిస్టు పార్టీల కార్యదర్శులతో వీరు చర్చలు జరిపే అవకాశం ఉంది. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య గతేడాది మృతి చెందడంతో ఉప ఎన్నికల అనివార్యమైంది.
ఇప్పటికే కాంగ్రెస్ తమ అభ్యర్థిగా జానారెడ్డిని ప్రకటించింది. సిట్టింగ్ స్థానం కావడంతో టీఆర్ఎస్ అభ్యర్థి ఎంపికపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నది. బీజేపీ సైతం అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.