ముంబై, జూలై 2: ప్రముఖ బాలీవుడ్ నటి యామీ గౌతమ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) గురువారం సమన్లు జారీ చేసింది. విదేశీ మారక నిర్వహణ చట్టాన్ని(ఫెమా) ఉల్లంఘించారన్న ఆరోపణలకు సంబంధించి ఈ నెల 7న దక్షిణ ముంబైలో ఉన్న తమ ఆఫీసులో విచారణకు హాజరుకావాలని ఆమెను ఆదేశించింది. గతంలో కూడా ఈడీ యామీకి సమన్లు పంపినా దానికి ఆమె స్పందించలేదు. ఒక ప్రైవేట్ బ్యాంకులో రూ.1.5 కోట్ల లావాదేవీకి సంబంధించి ఆమెపై కేసు నమోదైంది.