Nitin Gadkari on NHAI | ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఎక్స్ప్రెస్ వే ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే అని కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. దీని నిర్మాణం పూర్తయి, 2023లో వినియోగంలోకి రానుందని. ప్రతి నెలా రూ.1000-1500 కోట్ల ఆదాయం తెచ్చి పెడుతుందన్నారు. ఢిల్లీ- ముంబై మధ్య ప్రయాణానికి 24-26 గంటలు పడితే, ఈ ఎక్స్ప్రెస్వేతో 12-13 గంటలకు తగ్గి వస్తుందని చెప్పారు.
దేశవ్యాప్తంగా రోడ్లు, రహదారులపై మౌలిక వసతుల కల్పనతో వచ్చే ఐదేండ్లలో టోల్గేట్ల ద్వారా జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ)కి రూ.1.40 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని నితిన్ గడ్కరీ అన్నారు. ఇప్పుడు రూ.40 వేల కోట్ల ఆదాయం మాత్రమే వస్తోంది. కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం జనరేట్ చేయడంలో జాతీయ రహదారుల సంస్థ గోల్డ్ మైన్ వంటిది కానుందన్నారు.
ఎన్హెచ్ఏఐ రూ.3.07 లక్షల కోట్ల రుణాల ఊబిలో ఉందని వస్తున్న ఆరోపణలను కొట్టి పారేశారు. 2017 మార్చితో పోలిస్తే ఇది నాలుగింతలు ఎక్కువ. ఎన్హెచ్ఏఐకి ఏఏఏ రేటింగ్ ఉందని, దాని అన్ని ప్రాజెక్టులు నిర్మాణాత్మకమేనని స్పష్టం చేశారు.