న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: మహిళా హక్కుల కోసం జీవితాంతం పోరాడిన ప్రముఖ రచయిత్రి కమలా బాసిన్ (75) కన్నుమూశారు. క్యాన్సర్తో బాధపడుతున్న ఆమె శనివారం మరణించారు. ప్రస్తుతం ఏ నిరసనల్లోనైనా వినిపించే ఆజాదీ నినాదం తొలుత బాసిన్ ద్వారానే ప్రాచుర్యం పొందింది. ఆమె దేశంలోనే కాకుండా దక్షిణాసియా దేశాల్లోనూ మహిళల సమస్యలపై పోరాడారు. బాసిన్ మరణంపై పలువురు హక్కుల కార్యకర్తలు, రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.