అహ్మదాబాద్: ఇంగ్లాండ్తో ఐదో టీ20 మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. భారత ఓపెనర్ రోహిత్ శర్మ(64) వీరవిహారం చేశాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతున్న రోహిత్ 30 బంతుల్లోనే 3ఫోర్లు, 4సిక్సర్ల సాయంతో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. సిక్స్లు, ఫోర్లతో జోరందుకున్న హిట్మ్యాన్..శామ్ కరన్ వేసిన 8వ ఓవర్ ఆఖరి బంతిని సిక్స్ కొట్టి ఫిఫ్టీ మార్క్ చేరుకున్నాడు.
స్టోక్స్ వేసిన తర్వాతి ఓవర్లో వరుసగా 6, 4 బాదేశాడు. అదే ఓవర్ ఆఖరి బంతిని రోహిత్ వికెట్ల మీదకు ఆడుకొని ఔటయ్యాడు. బ్యాట్కు ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి నేరుగా వికెట్లను తాకింది. 9 ఓవర్లకు భారత్ వికెట్ నష్టానికి 94 పరుగులు చేసింది. ప్రస్తుతం కోహ్లీ(22) క్రీజులో ఉన్నాడు.