నర్సంపేట, ఏప్రిల్ 5 : జాతీయస్థాయి కరాటే పోటీల్లో నర్సంపేట విద్యార్థులు అద్భుత ప్రతిభ చూపారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, గుంటూరులో షిటోరియో కాయ్ కరాటే అకాడమీ నిర్వహించిన జాతీయస్థాయి ఓపెన్ కరాటే చాంపియన్షిప్ పోటీల్లో నర్సంపేటకు చెందిన షిటో రియో కరాటే డూ ఇండియా హంబు సంస్థకు చెందిన పాల్గొని పతకాలు సాధించారు. 12 సంవత్సరాల బాలికల విభాగంలో రీతు రిషిత, 14 సంవత్సరాల బాలుర విభాగంలో వికాస్, 15 సంవత్సరాల విభాగంలో కార్తీక్, 16 సంవత్సరాల విభాగంలో కాళీచరణ్, 17 సంవత్సరాల విభాగంలో కరీముల్లా బంగారు పతకాలు సాధించారు. సీనియర్ బ్లాక్ బెల్ట్ 22 సంవత్సరాల విభాగంలో పవన్ కల్యాణ్ బంగారు పతకంతో పాటు గ్రాండ్ చాంపియన్షిప్ ట్రోఫీని సాధించినట్లు షిటో రియో సంస్థ ఇండియా చీఫ్ ఇన్స్ట్రక్టర్ ఎగ్జామినర్ షిహాన్ రచ్చ శ్రీనుబాబు తెలిపారు. రాష్ట్ర టెక్నికల్ డైరెక్టర్ రచ్చ భవానీచంద్ తదితరులు విద్యార్థులను అభినందించారు.
ఇవి కూడా చదవండి..
ఆస్పత్రిలో ఆక్సిజన్ పైప్తో ఉరేసుకుని కొవిడ్ బాధితుడి ఆత్మహత్య
తేళ్లతో హోలీ కేళీ.. ఈ గ్రామం స్పెషల్..!