Delhi : దేశరాజధాని ఢిల్లీలో దొంగలు రెచ్చిపోతున్నారు. ప్రముఖులకు చెందిన కార్లను దొంగిలిస్తున్నారు. రెండు రోజుల క్రితం ప్రముఖ ఆర్కిటెక్ట్ సీతూ మహాజన్ కోహ్లీ హుండాయ్ క్రెటా కారును కొందరు దొంగిలించారు. తన కారు చోరీకి సంబంధించిన సీసీటీవీ పుటేజ్ను ఆమె ట్విట్టర్లో పెట్టింది. ‘ఢిల్లోలో మా ఇంటి బయట పార్క్ చేసిన కారు చోరీకి గురి కావడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. చుట్టుపక్కల అన్ని దౌత్య కార్యాలయాలు ఉన్నాయి. అయినా కూడా ఉదయం ఆరు గంటల ప్రాంతంలో దొంగలు కారును దొంగిలించారు. నెల క్రితమే మా ఇరుగుపొరుగు వాళ్ల కారును దొంగలు ఎత్తుకెళ్లారు. ఢిల్లీలో రక్షణ లేదు’ అంటూ సీతు మహాజన్ తన పోస్టులో రాసుకొచ్చింది.
నా కారును వాళ్లు అసాంఘిక కార్యకలాపాల కోసం వాడతారేమోనని భయంగా ఉంది. అసలే ఈ నెలలో గణతంత్ర దినోత్సవం (జనవరి 26) ఉంది అంటూ మరొక ట్వీట్లో ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. పోలీసులు కూడా దొంగతనం చేసినవాళ్లు ఆ కార్లతో ఏదైనా దాడికి పాల్పడే అవకాశం ఉందనే అనుమానం వెలిబుచ్చారు. సీతూ మహాజన్కు ఇంటీరియర్ డిజైన్ ఎక్స్పర్ట్గా పేరుంది. మనదేశంతో పాటు ఖతర్లో కూడా ఆమె ఇంటీరియర్ డిజైన్స్, లగ్జరీ బ్రాండ్స్ ఫర్నీచర్ను తయారు చేస్తుంటుంది.
Absolutely shocking to find out that my car was stolen right outside my house in Delhi, with all embassies around at around 6am in the morning. Hyundai Creta JK02CF0257.The neighbours car was stolen a month back! @dcp_southwest @RaviRanjanIn @Chaiti @shahfaesal @tehseenp @CPDelhi pic.twitter.com/qOLaJEKQ9u
— Seetu Mahajan Kohli (@kohliseetu) December 31, 2022