రాయ్పూర్: ఛత్తీస్గడ్లోని దంతేవాడలో పోలీసులు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసుల ఎన్కౌంటర్లో ఓ మహిళా నక్సలైట్ మృతిచెందింది. దంతేబాడ జిల్లా గుమల్నార్ అడవుల్లో పోలీసులు నక్సలైట్లకోసం గాలింపు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో మహిళా నక్సలైట్ హతమయ్యింది. ఘటనా స్థలంలో లభించిన 2 కిలోల పేలుడు పదార్థాలు, రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. మరణించిన నక్సలైట్పై గతంలో రూ.2 లక్షల రివార్డు ఉందని వెల్లడించారు.