జైపూర్: ఆమె మహిళా హెడ్ కానిస్టేబుల్. అతడో డీఎస్పీ. ఇద్దరు కొన్నిసార్లు కలుసుకున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని అతడిని బెదిరించడం మొదలుపెట్టింది. డబ్బులు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేస్తూ వస్తున్నది. విసిగెత్తిన అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అమెను అరెస్టు చేశారు. ఇదంతా రాజస్థాన్లో జరిగింది.
రాష్ట్రంలోని బండి జిల్లాలోని ఉన్న పోలీస్ స్టేషన్లో ఓ మహిళ హెడ్కానిస్టేబుల్గా పనిచేస్తున్నది. డిప్యూటీ సూపరింటెండెంట్ (డీఎస్పీ) మరో జిల్లాలో పనిచేస్తున్నాడు. వ్యక్తిగతంగా ఇద్దరు పలుమార్లు కలుసుకున్నారు. ఇద్దరి మధ్య పరస్పర సంబంధం ఉన్నది. దీనిని ఆసరాగా చేసుకుని ఆమె డీఎస్పీని వేదించడం మొదలు పెట్టింది. రూ.5.5 లక్షలు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేస్తూ వస్తున్నది. దీంతో ఆ అధికారి జైపూర్లోని శాస్త్రీ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం ఆ మహిళా హెడ్ కానిస్టేబుల్ను అరెస్టు చేశారు. ఈ విషయంలో ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి