వరంగల్, ఏప్రిల్ 19 : ఇప్పటి వరకు స్వీకరించిన సమాచారాన్ని వెంటనే టీ-పోల్ యాప్లో నమోదు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్గాంధీ హన్మంతు ఆదేశించారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్హాల్లో కమిషనర్ పమేలా సత్పతితో కలిసి నామినేషన్ల నమోదు, స్క్రూటినీ ప్రక్రియపై ఆర్వోలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్గాంధీ హన్మంతు మాట్లాడుతూ.. ప్రతి వార్డులో నమోదైన నామినేషన్ల వివరాలను టీ-పోల్ యాప్లోని ఫారం-3లో నమోదు చేసి సరి చూసుకోవాలన్నారు. ప్రతి వార్డు ఆర్వో ఫారం-3లో సమాచార నమోదు వల్ల ఫారం-1 అప్డేట్ అవుతుందన్నారు. పూరించిన వివరాలను కమిషనర్కు తెలిపిన అనంతరం స్క్రూటినీ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఇప్పటివరకు 1753 నామినేషన్ల సమాచారం యాప్లో పొందుపర్చాలన్నారు. కంప్యూటర్ ఆపరేటర్ల సహకారంతో ఎలాంటి తప్పులు లేకుండా ఖచ్చితమైన సమాచారం ఎంట్రీ చేయాలన్నారు. ఇక్కడ ఉన్న సమాచారం ఆన్లైన్ సమాచారంతో సరిపోయేలా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ సీహెచ్ నాగేశ్వర్, పర్యవేక్షకుడు జాకీర్ హుస్సేన్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
భయాందోళన మధ్య పని చేస్తున్నాం.. వర్క్ ఫ్రం హోం ఇవ్వండి..
ఈ 8 చెడు అలవాట్లు మానుకోండి.. ఆయుష్షు పెంచుకోండి..!