న్యూఢిల్లీ : దేశంలో కరోనా సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు కొనసాగుతున్నాయి. మహమ్మారి కట్టడిలో ‘వ్యవస్థ విఫలమైంది’ అని ఆరోపించారు. జన్కీ బాత్ ముఖ్యం అంటూ ఆదివారం ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కార్యకర్తలంతా రాజకీయ కార్యక్రమాలను, పనులను పక్కన పెట్టి కొవిడ్ రోగులకు, వారి బంధువులకు సహాయం అందిస్తూ వారి బాధలను తగ్గించాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ‘ఇది కాంగ్రెస్ కుటుంబ ధర్మం’ అని ట్వీట్ చేశారు. దేశానికి ఇప్పుడు బాధ్యతాయుతమైన వ్యక్తులు అవసరమని పేర్కొన్నారు. పార్టీ నేతలు తమకు తాముగా ముందుకు వచ్చి ప్రజల సేవలో పాల్గొనాలన్నారు.
ఇవికూడా చదవండి..