న్యూఢిల్లీ: దేశంలో పేరొందిన విద్యాసంస్థ ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ను ఎడ్ టెక్ మేజర్ బైజూ సొంతం చేసుకున్నది. బైజూ సోమవారం ఈ సంగతిని ధ్రువీకరించింది. ఆకాశ్ ఎడ్యుకేషనల్ సంస్థను దాదాపు బిలియన్ డాలర్ల (900 డాలర్ల పై చిలుకు) మొత్తానికి టేకోవర్ చేసుకున్నట్లు తెలిపింది. భారతదేశంలోనే తమ అత్యంత ఖరీదైన ఒప్పందాల్లో ఇది ఒకటిగా నిలుస్తుందని బైజూ వ్యాఖ్యానించింది.
ఆకాశ్ ఎడ్యుకేషనల్ సంస్థను టేకోవర్ ఒప్పంద లావాదేవీల ప్రక్రియను దాని అడ్వైజర్ ఫోనిక్స్ అడ్వైజర్స్, బైజూ ఫైనాన్సియల్ అడ్వైజర్ ఈవై సంయుక్తంగా నిర్వహించాయి. బైజూతో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకోవడంలో తాము నూతన మైలురాయిని దాటామని చెప్పడానికి సంతోషిస్తున్నామని ఆకాశ్ ట్వీట్ చేసింది.
రెండు సంస్థల మధ్య టేకోవర్ ఒప్పందం పూర్తయినప్పటికీ, ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్వీస్ స్వతంత్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఆకాశ్ వ్యవస్థాపకులు జేసీ చౌదరి, ఆకాశ్ చౌదరిలు సంస్థకు సారథ్యం వహిస్తారు.
రెండు సంస్థల మధ్య భాగస్వామ్యంతో ఆకాశ్ విద్యార్థులకు బైజూ కంటెంట్, టెక్నాలజీ సామర్థ్యాన్ని వినియోగించుకునే వెసులుబాటు కలుగుతుంది. దేశవ్యాప్తంగా ఆన్లైన్, ఆఫ్లైన్లలో నూతన విద్యార్థులను చేర్చుకోవడానికి ఆకాశ్ మరికొన్ని కేంద్రాలను తెరవనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, హీరోయిన్ భూమికి కరోనా
కళ్లు చెదిరే రీతిలో రాజస్థాన్ రాయల్స్ కొత్త జెర్సీ లాంచ్.. వీడియో
తప్పు నాదే.. డీకాక్ది కాదు: ఫకర్ జమాన్
కొవిడ్తో హాస్పిటల్లో చేరిన బాలీవుడ్ సింగర్
ఇదేం క్రీడాస్ఫూర్తి.. ఫకర్ జమాన్ను డీకాక్ మోసం చేశాడా.. వీడియో