అస్సాంలో అఖిల్ గొగోయ్ ఘనత
శివ్నగర్, మే 3: ఎన్నికల్లో గెలవాలంటే డబ్బు కావాలి. మందీమార్బలం కావాలి. ఓటేయండని ఒకటికి రెండుసార్లు బతిలాడాలి. కానీ, అస్సాంలో అఖిల్ గొగోయ్ ఇవేవీ చేయకుండా ఎన్నికల్లో గెలిచారు. జైలు నుంచే ఎమ్మెల్యే అయ్యారు. 2019 డిసెంబర్లో సీఏఏ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న అఖిల్ దేశద్రోహం కేసులో జైలుకు వెళ్లారు. ప్రస్తుతం జైలులోనే ఉన్నారు. అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో శివ్నగర్ నుంచి ఇండిపెండెంట్గా బరిలో దిగారు. 57,219 ఓట్లు సాధించారు. సమీప ప్రత్యర్థిపై (బీజేపీ) 11,875 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. అఖిల్ తరఫున అతని తల్లి ప్రియదా గొగోయ్ (85) ప్రచారం చేశారు.