ఘట్కేసర్ రూరల్, జూన్ 1: బాలికపై లైంగికదాడికి పాల్పడిన ఘటనలో నిందితుడికి కోర్టు జీవిత ఖైదుతోపాటు రూ.10వేల జరిమానా విధించింది. ఘట్కేసర్ ఇన్స్పెక్టర్ చంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్కేసర్ మండల కేంద్రంలో నివాసం ఉంటున్న వంగూరి ప్రవీణ్ కుమార్ అలియాస్ కుమార్(32).. తన ఇంటి పక్కన నివాసం ఉండే ఇంటర్ విద్యార్థిని(17)కి మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లాడు. కాఫీలో మత్తు మందు ఇచ్చి పలుమార్లు లైంగికదాడికి పాల్పడగా బాలిక గర్భం దాల్చింది. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు 2015 ఆగస్టు 8న ఘట్కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఆ తర్వాత చార్జిషీట్ దాఖలు చేశారు. మంగళవారం విచారణ చేపట్టిన సైబరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి సురేశ్.. నిందితుడు ప్రవీణ్కుమార్కు జీవిత ఖైదుతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.