మెదక్, జూన్ 16 : ప్రజా సమస్యల పరిష్కారానికే ‘మీ కోసం నేనున్నా’ కార్యక్రమం చేపట్టామని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. బుధవారం మెదక్ నూతన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ‘మీ కోసం నేనున్నా’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుంటానని తెలిపారు. ప్రతి నెలా 2, 16వ తేదీన మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ‘మీ కోసం నేనున్నా’ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ప్రజా సమస్యలు తెలుసుకొని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశిస్తున్నామన్నారు.
‘డయల్ యువర్ ఎమ్మెల్యే’కు 54 మంది ఫిర్యాదు..
‘డయల్ యువర్ ఎమ్మెల్యే’ కార్యక్రమానికి బుధవారం ఒక్కరోజే 54 మంది తమ సమస్యలను విన్నవించారు. ‘మీ కోసం నేనున్నా’ కార్యక్రమానికి 133 మంది లిఖితపూర్వకంగా తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, ఆర్డీవో సాయిరాం, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, ఎంపీపీ యమున, తహసీల్దార్ రవికుమార్, వ్యవసాయ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ అధికారులు, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి చెక్కుల అందజేత..
మెదక్ పట్టణంతోపాటు మండలానికి చెందిన 64 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. మెదక్ నియోజకవర్గంలోని చిన్నశంకరంపేట, రామాయంపేట, మెదక్ పట్టణం, మెదక్ మండలం, హవేళీఘణాపూర్, రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన 120 మందికి సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ.42,55,500 చెక్కులను బాధితులకు అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కౌన్సిలర్లు దొంతి లక్ష్మి, వసంత్రాజ్, జయరాజ్, మెదక్ ఎంపీపీ యమునజయరాంరెడ్డి, నిజాంపేట జడ్పీటీసీ విజయ్కుమార్, ఎంపీపీ సిద్ధిరాము లు, నాయకులు అశోక్, లింగారెడ్డి, అంజాగౌడ్, కిష్టయ్య, శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
రామాయంపేటలో..
రామాయంపేట మం డలం దంతెపల్లి గ్రామానికి చెందిన తొలుకుల సత్తవ్వకు మంజూరైన రూ.41 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అందజేశారు. బుధవారం మెదక్ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే చెక్కును అందజేశారు. ఇటీవల సత్తవ్వ ఇంట్లో పనులు చేస్తుండగా జారి పడి కాలు విరిగింది. కార్యక్రమంలో కాట్రియాల ఎంపీటీసీ దేవేందర్, టీఆర్ఎస్ నాయకులు నారాయణ, కిషన్ పాల్గొన్నారు.