డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో ఉన్న ప్రముఖ నేషనల్ పార్క్ జిమ్ కార్బెట్( Jim Corbett ) పేరును రామ్గంగా మార్చే అవకాశం ఉన్నదని ఈ టైగర్ రిజర్వ్ డైరెక్టర్ బుధవారం వెల్లడించారు. ఈ నెల 3న ఈ నేషనల్ పార్క్ను సందర్శించిన కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అశ్విని కుమార్ చౌబే.. జిమ్ కార్బెట్ పేరును రామ్గంగాగా మారుస్తామని చెప్పినట్లు ఆయన వెల్లడించారు. ఇక రామ్నగర్లో ఉన్న ధేలా రెస్క్యూ సెంటర్లో టైగర్ సఫారీని ఏర్పాటు చేస్తామని, దీనికి సంబంధించిన కార్యాచరణ పూర్తయిందని కూడా మంత్రి అశ్విని కుమార్ చెప్పారు. ఇది 1936లో హేలీ నేషనల్ పార్క్గా ప్రారంభమైంది. ఆ తర్వాత జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్గా మారిన ఇందులో 1973లో తొలిసారి ప్రాజెక్ట్ టైగర్ మొదలైంది. ఇది 520 చదరపు కిలోమీటర్ల మేర వ్యాపించి ఉంది.