న్యూఢిల్లీ: రాజ్యసభలో బుధవారం జరిగినదానికి తాను ఎందుకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ మహిళా ఎంపీ, రాజ్యసభలో కాంగ్రెస్ కొత్త విప్ ఛాయా వర్మ ప్రశ్నించారు. ఎగువ సభలో బుధవారం జరిగిన సంఘటనలో తమ పార్టీ మహిళా ఎంపీ గాయపడ్డారని అన్నారు. సెక్యూరిటీ సిబ్బంది ఆమెపై చేయిచేసుకున్నారని ఆరోపించారు. ఈ ఘటనకు ఎవరు బాధ్యులు అని ప్రశ్నించారు. సభలో చాలా మంది మార్షల్స్ను ఎందుకు మోహరించారు అని నిలదీశారు. ఈ విషయంపై పీయూష్ గోయల్ని అడగాలని అన్నారు. పార్లమెంటు కార్యకలాపాలు నడపడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. తాము పార్లమెంటులో ప్రజల గొంతు వినిపిస్తున్నామన్నారు. ప్రజల గొంతును ప్రభుత్వం వినని పక్షంలో ఇలాంటివి జరుగుతాయని మండిపడ్డారు.