నాగపూర్: సంస్కృతాన్ని దేశ అధికార భాషగా ఎందుకు చేయకూడదని భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి శరద్ బోబ్డే ప్రశ్నించారు. సంస్కృత భారతి ఆధ్వర్యంలో శుక్రవారం నాగపూర్లో జరిగిన అఖిల భారత ఛత్ర సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ కొన్ని దశాబ్దాల క్రితమే ఈ ప్రతిపాదనను తీసుకువచ్చారని గుర్తు చేశారు. మన దైనందిన జీవితంలోకి సంస్కృత భాషను తేవడమంటే అది ఏ మతాన్నో ప్రోత్సహిస్తున్నట్టు కాదన్నారు. సంస్కృత భాష అన్నది కేవలం దక్షిణ భారతానికో, ఉత్తర భారతానికో చెందినది కాదని అది కచ్చితంగా లౌకిక వినియోగానికి సంపూర్ణ సామర్థ్యం ఉన్నదన్నారు.