లక్నో : కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే మనుషులను అరెస్టు చేయాలి కానీ రసగుల్లలను సీజ్ చేయడమేంటని అనుకుంటున్నారా? ఇది నిజమే. ఎందుకంటే ఓ ఇద్దరు వ్యక్తులు రసగుల్లలను పంచి.. కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారని భావించి.. ఏకంగా రసగుల్లలనే సీజ్ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని హాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఇటీవలే వెలుగు చూసింది.
యూపీ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం విజయోత్సవ ర్యాలీలు నిర్వహించొద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. కానీ ఈ ఆదేశాలను యూపీలోని ఇద్దరు వ్యక్తులు తుంగలో తొక్కారు. యూపీ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం తమ అభ్యర్థులు గెలిచారన్న సంతోషంతో.. ఇద్దరు వ్యక్తులు రసగుల్లలను పంచిపెట్టారు. దీంతో అందరూ గుమిగూడారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిచారని, అందుకు కారణం రసగుల్లలను పంచడమే అని భావించి 20 కిలోల స్వీట్ను సీజ్ చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి..