ముంబై : గ్రామాల్లో కరోనా మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం బుధవారం కరోనా రహిత గ్రామం పేరుతో పోటీని ప్రకటించింది. కొవిడ్-19 వ్యాప్తిని పూర్తిగా అరికట్టిన గ్రామ పంచాయితీకి ఫస్ట్ ప్రైజ్ కింద రూ 50 లక్షలు, సెకండ్ ప్రైజ్ గా రూ 25 లక్షలు, థర్డ్ ప్రైజ్ కింద రూ 25 లక్షలు అందచేస్తామని మహారాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి హసన్ ముష్రిఫ్ వెల్లడించారు.
ప్రతి రెవెన్యూ డివిజన్ లో కరోనా కట్టడికి అద్వితీయంగా పనిచేసిన మూడు గ్రామాలను ఎంపిక చేసి ఈ బహుమతులు అందిస్తామని చెప్పారు. ఈ పోటీలో గెలుపొందిన గ్రామాలకు ప్రైజ్ మనీకి సమానమైన మొత్తాన్ని ప్రోత్సాహకరంగా అందిస్తామని వెల్లడించారు. ఈ మొత్తాన్ని ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనులకు వెచ్చిస్తారని చెప్పారు.