న్యూఢిల్లీ: ఒక కేంద్ర మంత్రికే రక్షణ లేకపోతే బెంగాల్లో ఎవరైనా సురక్షితంగా ఉండగలరా అని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్లో కేంద్ర మంత్రి వీ మురళీధరన్ కాన్వాయ్పై స్థానికులు రాళ్లు, కర్రలతో దాడి చేసిన ఘటనను ఆయన ఖండించారు. ఇది రాష్ట్రం ప్రేరేపిస్తున్న హింస అని ఆరోపించారు. నిందితులను చట్టం ద్వారా శిక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రకాష్ జవదేకర్ డిమాండ్ చేశారు.
మరోవైపు వెస్ట్ మిడ్నాపూర్ పంచ్క్కుడిలో గురువారం తన కాన్వాయ్పై జరిగిన దాడిలో వ్యక్తిగత సిబ్బందికి గాయాలయ్యాయని కేంద్ర మంత్రి మురళీధరన్ ట్వీట్ చేశారు. టీఎంసీ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. కాగా, మురళీధరన్ ప్రయాణిస్తున్న కారు ఈ దాడిలో ధ్వంసమైంది. దీంతో తన పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారు.