న్యూఢిల్లీ: తాను ఎంపీగా ఉన్నప్పుడు, కుల ఆధారిత జనాభా గణన కోసం ఇతరులతో కలిసి లోక్సభలో పోరాడినట్లు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఢిల్లీలో తెలిపారు. దివంగత కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ గతంలో దీనిపై రాత పూర్వకంగా హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. కుల ఆధారిత జనాభా గణన గురించి తాము చాలా ఆశతో ఉన్నట్లు లాలూ చెప్పారు. జనాభా, ప్రజల ఆర్థిక స్థితిని అర్థం చేసుకోవడానికి కులం ఆధారంగా జనాభా గణనను చేపట్టాలని కేంద్రాన్ని ఆయన కోరారు.
కాగా, బీహార్ సీఎం నితీశ్ కుమార్, అఖిలపక్ష నేతలతో కలిసి ఈ అంశంపై ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. లాలూ కుమారుడు, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కూడా ఆయన వెంట ఉన్నారు. ఈ సందర్భంగా లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం గురించి తేజస్వీతో ప్రధాని మోదీ ఆరా తీశారు.