న్యూఢిల్లీ: మెసేజింగ్ యాప్ వాట్సాప్ ( WhatsApp ) దేశంలో గత మే నెల 15 నుంచి జూన్ 15 వరకు 20 లక్షలకు పైగా ఖాతాలను నిషేధించింది. ఈ విషయం కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖకు సమర్పించిన నెలవారీ నివేదికలో వాట్సాప్ నివేదించింది.
ఆన్లైన్లో దుర్భాషణల నుంచి యూజర్లకు భద్రత కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. నూతన ఐటీ రూల్స్ ప్రకారం.. వాట్సాప్తోపాటు సోషల్ మీడియా సంస్థలన్నీ ప్రతి నెలా కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖకు నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.
‘యూజర్లను సేఫ్గా, సురక్షితంగా ఉంచేందుకు మేం నిరంతరం టెక్నాలజీపై ఇన్వెస్ట్ చేస్తున్నాం. హానికర మెసేజ్లు పంపకుండా నివారించడంపైనే మా ఫోకస్ ఉంటుంది. ఇటువంటి ఖాతాలను గుర్తించేందుకు అత్యాధునిక టెక్నాలజీ టూల్స్ నిర్వహిస్తున్నాం. వీటి సాయంతో 20 లక్షల ఖాతాలను నిషేధించాం’ అని వాట్సాప్ తెలిపింది.