న్యూఢిల్లీ: ఒలింపిక్స్లో భారత్ తరఫున రెండు వ్యక్తిగత పతకాలు సాధించిన ఏకైక రెజ్లర్ సుశీల్ కుమార్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఉత్తర ఢిల్లీలోని ఛత్రాసాల్ స్టేడియంలో మంగళవారం రాత్రి రెజ్లర్ల మధ్య జరిగిన గొడవలో 23 ఏండ్ల సాగర్ మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. సంఘటనా స్థలంలో లభించిన ఐదు వాహనాలు, ఒక తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ గురిఖ్బాల్ సింగ్ సిద్ధు పేర్కొన్నారు. ఈ ఘటనలో స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ పాత్రను పరిశీలిస్తున్నామని.. ప్రస్తుతానికి అతడి పేరును ఎఫ్ఐఆర్లో పొందుపరిచామని.. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.