కొడంగల్/ బొంరాస్పేట, ఏప్రిల్ 28: కరోనా ఉధృతిని అరికట్టడానికి ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని వైద్యులు డా.రవీంద్రయాదవ్, డా.వీణ, డా.గో పాల్ సూచించారు. బుధవారం కొడంగల్ సీహెచ్సీ, బొంరాస్పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా పరీక్షలతో పాటు కొవిడ్ టీకాలను వేశారు.కొడంగల్ పరిధిలో మొత్తం 50 మందికి పరీక్షలు నిర్వహించగా 18 మందికి, బొంరాస్పేట మండలంలో మొత్తం 53 మంది పరీక్షలు నిర్వహించగా 30 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా 58మందికి టీకాలు వేసినట్లు వైద్యు లు తెలిపారు.
ధారూరు పరిధిలో 12మందికి..
ధారూరు, ఏప్రిల్ 28: ధారూరు మండల పరిధిలోని నాగసముందర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో నలుగురికి, ధారూరు పీహెచ్సీ పరిధిలో 12మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ధారూరు, నాగసముందర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు రాజు, రమేశ్బాబు తెలిపారు. బుధవారం ధారూరు మండల పరిధిలోని నాగసముందర్ పీహెచ్సీ పరిధిలో 26మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిటివ్ వచ్చింది. ధారూరు పీహెచ్సీ పరిధిలో 50మందికి పరీక్షలు నిర్వహించగా 12మందికి పాజిటివ్ వచ్చింది.కార్యక్రమంలో దవాఖాన సిబ్బంది ఉన్నారు.
మోమిన్పేటలో18మందికి…
మోమిన్పేట:మండల పీహెచ్సీలో బుధవారం 62 మందికి కరోనా పరీక్షలు చేయగా 18 మందికి పాజిటి వ్ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు.
మర్పల్లిలో 40మందికి..
మర్పల్లి, ఏప్రిల్ 28: పట్లూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, మర్పల్లి సీహెచ్సీలో బుధవారం 137 మందికి కరోనా పరీక్షలు చేయగా 40మందికి పాజిటివ్ వచ్చినట్లు డాక్ట ర్ అంబిక తెలిపారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన 176మందికి వ్యాక్సిన్ వేశామన్నారు. మే 1 నుంచి 18 ఏండ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్ వేస్తామన్నారు.