కోల్కతా: భారత స్వాతంత్ర్య పోరాటం, బెంగాల్ విభజనపై మొబైల్ ‘పార్టిషన్ మ్యూజియం’ను పశ్చిమ బెంగాల్ రవాణా శాఖ ఆదివారం ప్రారంభించింది. దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కోల్కతాలో రెండు ట్రామ్లను గ్యాలరీగా మార్చింది. దేశ స్వాతంత్ర్య పోరాటం, బెంగాల్ విభజనపై ‘పార్టిషన్ మ్యూజియం’ను ఏర్పాటు చేసింది. స్వాతంత్ర్య సంగ్రామం, బెంగాల్ విభజనకు సంబంధించిన పత్రాలు, పుస్తకాలు, చారిత్రక ఫొటోలు ఇందులో ప్రదర్శించారు.
కోల్కతాలోని ఎస్ప్లానేడ్లో ఏర్పాటు చేసిన ఈ మొబైల్ ‘పార్టిషన్ మ్యూజియం’ ప్రజల సందర్శన కోసం డిసెంబర్ వరకు అక్కడ ఉంటుందని, అనంతరం నగరంలోని ఇతర ప్రాంతాలకు తరలిస్తామని బెంగాల్ రవాణా శాఖ అధికారులు తెలిపారు.