కోల్కతా: పశ్చిమ బెంగాల్ కార్మికశాఖ మంత్రి బేచారమ్ మన్నా బుధవారం అసెంబ్లీకి సైకిల్పై వచ్చారు. హూగ్లీ జిల్లాలో ఉన్న తన ఇంటి నుంచి ఏకంగా 38 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ ఆయన అసెంబ్లీకి రావడం గమనార్హం. కోల్కతాలో పెట్రోల్ ధర రూ.100 దాటిన వేళ అందుకు నిరసనగా మంత్రి ఇలా సైకిల్పై వచ్చారు. ఈయన సింగూర్ నుంచి టీఎంసీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2000లో టాటా నానో ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నిరసన చేపట్టి వార్తల్లో నిలిచిన బేచారమ్.. ఇప్పుడిలా పెరిగిన పెట్రోల్ ధరలను వ్యతిరేకిస్తూ సైకిల్ యాత్ర చేపట్టారు. ఉదయం 8 గంటల సమయంలో ఇంటి నుంచి బయలుదేరిన ఆయన.. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో అసెంబ్లీకి చేరుకున్నారు. పెరిగిన పెట్రోల్ ధరలు మోదీ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని, కోల్కతాలో పెట్రోల్ ధర 100 దాటినందుకు నిరసనగా తాను ఇలా చేశానని ఆయన చెప్పారు.