మాదకద్రవ్యాలు మనిషి మానసిక స్థితిపై ప్రభావం చూపడమే కాకుండా శరీరంలోని అన్ని అవయవాలను అస్తవ్యస్తం చేస్తాయి. వాటికి బానిసలై ఒక్కసారిగా దూరమైన వారి ప్రవర్తన చాలా భిన్నంగా ఉంటుంది. వీటికి అలవాటుపడి ప్రాణాలు కోల్పోతున్న వారెందరో. ఇంతకుముందు 25 ఏండ్ల వయస్సులో వ్యసనాలకు లోనైన వారు ఇప్పుడు పదహారేళ్లకే ఈ పదార్థాలు వాడుతున్నారని నివేదికలు చెబుతున్నాయి.నేడు సమాజంలో ఎక్కువగా యువత మత్తుపదార్థాలకు బానిసవుతున్నది. మాదక ద్రవ్యాల ఉచ్చులో పడకుండా మానవాళిని రక్షించేందుకు, మాదక ద్రవ్యాల వాడకం లేని సమాజాన్ని సృష్టించేందుకు ప్రమాణం చేసే లక్ష్యంతో జూన్ 26ను అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంగా ఐరాస ప్రకటించింది.
మాదక ద్రవ్యాలు..
మద్యం, కల్తీ కల్లు, గుడుంబా, సిగరెట్, బీడీ, గుట్కా, జర్ధా, తంబాకు, గంజాయి, బంగ్, నల్లమందు, కొడైన్, పెథిడిన్, హెరాయిన్, కొకైన్, అంఫిటమైన్
బానిసకావడానికి కారణం
మొదటిసారి మత్తు పదార్థం తీసుకున్నప్పుడు అది నాడీ మండలానికి చేరి మెదడులోని నాడీ కణాలను ఉత్తేజపరుస్తుంది. తద్వారా డోపమైన్ అనే రసాయన పదార్థం విడుదలై మత్తుగా, హుషారుగా ఉన్నట్లుగా అనుభూతి పొందుతారు. ఈ అనుభూతి పొందే ప్రయత్నంలోనే బానిసలవుతారు. ఇందులో ప్రధానంగా యువకులే ఎక్కువగా ఉండడం విశేషం.
దుష్పరిణామాలు
మత్తుకు దూరంగా ఉండాలి
మత్తు పదార్థాలు తీసుకోవడంతో అనేక సమస్యలు ఎదురవుతాయి. కుటుంబాల్లో కలహాలు, భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి. జీవితంలో ఆర్థికంగా, మానసికంగా కుంగిపోయే ప్రమాదం ఉంది. మత్తుకు బానిసైన వారు మానసిక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవడంతో విముక్తి పొందవచ్చు.