కోల్కతా : పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్దదేవ్ భట్టాచార్య, ఆయన సతీమణి మీరా భట్టాచార్య ఇవాళ కోల్కతాలోని నర్సింగ్ హోమ్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత కొన్ని రోజుల నుంచి ఇద్దరూ కోవిడ్ సంబంధిత రుగ్మతలకు చికిత్స పొందుతున్నారు. అయితే ఇవాళ మాజీ సీఎం భట్టాచార్య డిశ్చార్జీ అయినట్లు డాక్టర్లు వెల్లడించారు. గత నెల 25వ తేదీన కోవిడ్ వల్ల బుద్దదేవ్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఆక్సిజన్ లెవల్స్ 90 శాతం కన్నా తక్కువ నమోదు కావడంతో ఆయన్ను హాస్పిటల్కు తీసుకువెళ్లారు. 77 ఏళ్ల భట్టాచార్యకు మే నెలలో కరోనా వైరస్ సంక్రమించింది. మొదట ఆయనకు ఇంట్లోనే చికిత్స అందించారు. కానీ ఆక్సిజన్ లెవల్స్ డౌన్ కావడంతో హుటాహుటిన హాస్పిటల్కు తరలించారు. బెంగాల్ రాజకీయాల్లో సీపీఎం సీనియర్ నేతగా భట్టాచార్య ఎంతో ప్రఖ్యాతి గాంచారు. అయితే గత దశాబ్ధ కాలం నుంచి క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మోనరీ డిసీజ్ నుంచి ఆయన బాధపడుతున్నారు. గత ఏడాది అక్టోబర్లో కూడా భట్టాచార్యకు హాస్పిటల్లో చికిత్స అందించారు. అప్పుడు ఆయన్ను వెంటిలేటర్పై ఉంచారు. 13 మంది సభ్యుల మెడికల్ బోర్డు ఆయనకు చికిత్స అందించింది.