కోల్కతా : పశ్చిమబెంగాల్ శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై తృణమూల్ కాంగ్రెస్ ఆచితూచి వ్యవహరిస్తోంది. శుక్రవారం నాలుగు జిల్లాలోని నాలుగు అసెంబ్లీ స్థానాల్లో అనూహ్యంగా అభ్యర్థులను మారస్తూ నిర్ణయం తీసుకుంది. నదియా జిల్లాలోని కల్యాణి, ఉత్తర 24 పరిగణ జిల్లాలోని అశోక్ నగర్, అమ్దంగ నియోజకవర్గాలతోపాటు బిర్భం జిల్లాలోని దుబ్రాజ్పూర్ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థులను అధిష్ఠానం మార్చింది.
కల్యాణి నియోజకవర్గం నుంచి అనురుద్దా దాస్, అశోక్ నగర్ నుంచి నారాయణ్ గోస్వామి, అమ్దంగ అసెంబ్లీ స్థానం నుంచి రఫిఖుర్ రెహమాన్, దుబ్రాజ్పూర్ స్థానం నుంచి దేబబ్రత సాహాను బరిలో నిలుపుతున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ అధిష్ఠానం పేర్కొంది. 294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్ శాసనసభకు ఎనిమిది విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. తొలివిడత ఎన్నికలు ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 29న ఎనిమిదో విడత ఎన్నికలు జరుగుతాయి. మార్చి 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.