కోల్కతా: పశ్చిమబెంగాల్లో మే 2న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడగానే పలుచోట్ల హింస చోటుచేసుకుంది. ఈ హింసాత్మక ఘటనలపై బీజేపీ, టీఎంసీ పోటాపోటీ ఆరోపణలు చేసుకుంటున్నారు. తృణమూల్ గూండాలే తమ కార్యకర్తలపై, వారి ఇండ్లపై దాడి చేశారని బీజేపీ ఆరోపిస్తుండగా, బీజేపీ కార్యకర్తలే తమ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారని టీఎంసీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో హింసాత్మక ఘటనలపై చర్చించేందుకు పశ్చిమబెంగాల్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మమతాబెనర్జి ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశాని పశ్చిమబెంగాల్ చీఫ్ సెక్రెటరీ, హోంశాఖ కార్యదర్శి, డీజీపీ, కోల్కతా పోలీస్ కమిషనర్ తదితరులు హాజరయ్యారు. రాష్ట్రంలో హింస నిర్మూలన, శాంతిభద్రతల పరిరక్షణ తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది.