కోల్కతా : కరోనా ఉధృతి నేపథ్యంలో రాష్ట్రంలో 10, 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. సెకండరీ, హయ్యర్ సెకండరీ బోర్డు పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన మరుసటి రోజే ఈ నిర్ణయం వెలువడింది. పరీక్షల నిర్వహణపై విద్యార్థుల తల్లిదండ్రులూ అభిప్రాయం తెలుపాలని ఇటీవల ప్రభుత్వం సూచించింది. ఆగష్టు రెండో వారంలో మాధ్యమిక్ (10వ తరగతి) పరీక్షలు నిర్వహించాలని ఆ రాష్ట్ర సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు నిర్ణయించింది. ఈ ఏడాది 12 లక్షల మంది విద్యార్థులు మాధ్యమిక్, 8.5 లక్షల మంది ఉచ్చా మాధ్యమిక్ పరీక్షలు రాయాల్సి ఉంది. పరీక్షల రద్దు నేపథ్యంలో ప్రభుత్వం వీరందరినీ ఉత్తీర్ణులుగా పరిగణించింది. ఇటీవల సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను సైతం ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.