కోల్కతా: పశ్చిమబెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఝగ్రామ్లోని పోలింగ్ బూత్లో ఆయన ఓటు వేశారు. ఎనిమిది విడుతల బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇవాళ తొలి విడుత పోలింగ్ జరుగుతున్నది. తొలి విడుతలో మొత్తం 30 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. చిన్నచిన్న ఘటనలు మినహా ఇప్పటి వరకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది.
కాగా, ఓటు వేయడానికి ముందు మీడియాతో మాట్లాడిన దిలీప్ ఘోష్.. ప్రతిపక్ష బీజేపీ నేతలు రిగ్గింగ్ పాల్పడుతున్నారన్న అధికార తృణమూల్ కాంగ్రెస్ ఆరోపణలను కొట్టిపారేశారు. ఎన్నికల ఓటమి తప్పదనే విషయాన్ని టీఎంసీ నేతలు ఇప్పటికే గ్రహించారని, అందుకే వాళ్లు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఘోష్ విమర్శించారు. వాళ్లు ఆరోపణల్లో నిజం ఉంటే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయాలని దిలీప్ ఘోష్ వ్యాఖ్యానించారు.