National
- Dec 24, 2020 , 15:26:42
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో వామపక్షాలతో కాంగ్రెస్ పొత్తు

కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. కొత్త పొత్తులకు రాజకీయ పార్టీలు తెర తీస్తున్నాయి. త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష పార్టీలతో కలిసి పోటీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఆ పార్టీ బెంగాల్ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి ఈ మేరకు గురువారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో వామపక్షాలతో కలిసి ఎన్నికల కూటమిగా ఏర్పడేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ఈ రోజు అధికారికంగా ఆమోదించింది’ అని అందులో పేర్కొన్నారు.
కాగా, లౌకిక పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీ కోసం సీపీఎం సెంట్రల్ కమిటీ అక్టోబర్ నెలలోనే అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, వామపక్షాలు కలిసి స్థానాలను కేటాయించుకుని పోటీ చేయనున్నాయి.Today the Congress High command has formally approved the electoral alliance with the #Left parties in the impending election of West Bengal.@INCIndia@INCWestBengal
— Adhir Chowdhury (@adhirrcinc) December 24, 2020
తాజావార్తలు
- ముగియనున్న ఎమ్మెస్సీ నర్సింగ్, ఎంపీటీ దరఖాస్తు గడువు
- వనస్థలిపురం ఎస్ఎస్ఆర్ అపార్టుమెంటులో అగ్నిప్రమాదం
- 27-01-2021 బుధవారం.. మీ రాశి ఫలాలు
- లాజిస్టిక్ పార్క్ రెడీ..
- తెలుగు భాషకు ప్రాణం పోసిన మహనీయుడు ‘గిడుగు’
- ఘనంగా పద్మమోహన-టీవీ అవార్డ్స్...
- బాధితులకు సత్వర న్యాయం అందించడానికి కృషి
- త్యాగధనుల కృషి ఫలితమే గణతంత్రం
- సీసీఎంబీ పరిశోధనలు అభినందనీయం
- కామునిచెరువు సుందరీకరణపై స్టేటస్కో పొడిగింపు
MOST READ
TRENDING