కోల్కతా: పశ్చిమ బెంగాల్లో కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నది. పాక్షిక లాక్డౌన్ తరహా ఆంక్షలు విధించింది. బార్లు, షాపింగ్ కాంప్లెక్స్లు, బ్యూటీ పార్లర్లు, సినిమా హాల్స్, క్రీడా కేంద్రాలు, జిమ్స్, స్విమ్మింగ్ పూల్స్ వంటివి తదుపరి ఆదేశాల వరకు మూసి ఉంటాయని తెలిపింది. అన్ని సామాజిక, సాంస్కృతిక, వినోద, విద్యా సమావేశాలను నిషేధించింది.
అయితే ఫార్మసీలు, వైద్య పరికరాలను విక్రయించే షాపులు, కిరాణా దుకాణాలకు పాక్షిక లాక్డౌన్ నుండి ప్రభుత్వం మినహాయించింది. మార్కెట్లు కేవలం ఐదు గంటలు మాత్రమే తెరుస్తారు. ఉదయం 7-10, మధ్యాహ్నం 3-5 వరకు మాత్రమే పని చేస్తాయి. నిత్యవసరాల హోమ్ డెలివరీ, ఆన్లైన్ సేవలను అనుమతిస్తామని వెల్లడించింది. మే 2న అసెంబ్లీ ఎన్నికల లెక్కింపు నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద అన్ని కరోనా మార్గదర్శకాలను పాటించాలని ఆదేశించింది.