టాలీవుడ్ యాక్టర్ నితిన్ ప్రస్తుతం అంధాధున్ రీమేక్ మ్యాస్ట్రో లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయినట్టేనని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే నితిన్ ప్రముఖ రైటర్ కమ్ డైరెక్టర్ వక్కంతం వంశి డైరెక్షన్ లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్.
ఆగస్టులో ఈ చిత్రం అధికారికంగా లాంఛ్ కానుంది. వక్కంతం వంశి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో డైరెక్టర్ గా మారాడు. ఈ మూవీ బాక్సాపీస్ వద్ద ఆశించిన విజయం అందుకోలేదు. ఎలాగైనా ఈ సారి నితిన్ తో చేయబోయే సినిమాతో మంచి హిట్టు కొట్టాలని ఫిక్స్ అయ్యాడు.నితిన్ ఇప్పటికే పవర్ పేట చిత్రం చేయాల్సి ఉన్నా..దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అప్ డేట్ లేదు.
ఇవి కూడా చదవండి..
అలాంటి వాడు మొగుడుగా రావాలి..దివి మనసులో మాట
ఫారెస్ట్ ఆఫీసర్గా విద్యాబాలన్.. షేర్నీ ట్రైలర్ రిలీజ్
ముద్దుల కొడుకుతో జెనీలియా..వీడియో చక్కర్లు
వకీల్సాబ్ భామ హోం ఫొటోషూట్ వైరల్
టాలీవుడ్ పై మలయాళ స్టార్ హీరో దండయాత్ర..!
లాక్ డౌన్ ఎఫెక్ట్..పవన్ కల్యాణ్ సంగీత పాఠాలు
అభిమానులకు మాధవన్ విజ్ఞప్తి