హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): మరోవారంలో ఇంటర్ ఫలితాలు విడుదల చేస్తామని ఇంటర్బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ తెలిపారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఆన్లైన్ క్లాసులను జూలై 1 నుంచి ప్రారంభిస్తామన్నారు. మొదటి సంవత్సరం క్లాసులను జూలై మధ్యలో ప్రారంభిస్తామని చెప్పారు. విద్యాసంవత్సరం ఆరంభానికి ముందే ఫీజులు వసూలు చేస్తే ఆయాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.