అహ్మదాబాద్: ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. స్పిన్నర్ అక్షర్ పటేల్ వేసిన 14వ ఓవర్ మొదటి బంతికి డేవిడ్ మలన్(26) బౌల్డ్ కాగా, అదే ఓవర్ మూడో బంతికి అప్పుడే క్రీజులోకి వచ్చిన దీపక్ హుడా(1) రనౌట్ అయ్యాడు. మరో ఎండ్లో మయాంక్ నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ను ముందుండి నడిపిస్తున్నాడు. 15 ఓవర్లకు పంజాబ్ 4 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది. మయాంక్(47), షారుక్ ఖాన్(2) క్రీజులో ఉన్నారు.