శ్రీనగర్: జమ్ము కశ్మీర్కు సంబంధించిన అంశాలపై ప్రధాని మోదీ అధ్యక్షతన ఏర్పాటుచేసిన అఖిలపక్ష సమావేశానికి హాజరుకావాలని పీపుల్స్ అలయెన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్ (పీఏజీడీ) నిర్ణయించింది. ఈ విషయాన్ని గుప్కార్ చైర్పర్సర్ ఫరూక్ అబ్దుల్లా మంగళవారం వెల్లడించారు. భేటీకి తాము కూడా హాజరవుతామని కాంగ్రెస్ తెలిపింది.