లక్నో: కరోనా వ్యాక్సిన్ పాలసీపై కేంద్ర ప్రభుత్వమే కాదు ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా యూటర్న్ తీసుకున్నారు. ఇన్నాళ్లూ తాను బీజేపీ వ్యాక్సిన్ను తీసుకోను అని చెప్పానని, ఇప్పుడు భారత ప్రభుత్వం ఇవ్వబోయే వ్యాక్సిన్ తీసుకుంటానని అఖిలేష్ చెప్పడం గమనార్హం. వ్యాక్సిన్ పాలసీలో మార్పులపై సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనపై మంగళవారం అఖిలేష్ స్పందించారు.
ప్రజల ఆగ్రహానికి ప్రభుత్వం దిగి వచ్చిందని, ఇక తాను కూడా వ్యాక్సినేషన్ డ్రైవ్లో పాలుపంచుకుంటానని ట్వీట్ చేశారు. వ్యాక్సినేషన్ను ఇన్నాళ్లూ రాజకీయం చేసిన కేంద్రం.. ఇప్పుడు దిగి వచ్చిన తామే చేస్తామని చెప్పిందని అన్నారు. మేమే బీజేపీ వ్యాక్సిన్ను వ్యతిరేకించాం. కానీ భారత ప్రభుత్వ వ్యాక్సిన్ను స్వాగతిస్తున్నాం. మేము కూడా వ్యాక్సిన్ తీసుకుంటాం. ఇప్పటి వరకూ కొరత కారణంగా తీసుకోని వాళ్లందరు కూడా తీసుకోవాలని కోరుతున్నాం అని అఖిలేష్ ట్వీట్ చేశారు.